#


Index

ప్రస్థానత్రయ సారము

బయటపెట్టటానికే ఉంటుంది. ఇక్కడ ఈ సంకేతాలన్నీ మనకు చాటి చెప్పే సత్యం సర్వమూ పరమాత్మ స్వరూపమే అదే నీవు జీవుడని భావించే నీ స్వరూపం కూడాననే ఏకైక సత్యం. ఇదం సర్వం యదయ మాత్మా అహం బ్రహ్మాస్మి అని రెండు మాటలలో దీన్ని చాటి చెబుతున్నది ఉపనిషత్తు.

  అయితే ఇది ఒక్కసారిగా అందుకోగలిగితే వాడుత్త మాధికారి Competent. అలా కాకుంటే శ్రవణ మనన నిది ధ్యాసలనే మూడు భూమికలలో అంచెలవారిగా సాధన చేసి అనుభవానికి తెచ్చుకోమని సాధన మార్గాన్ని కూడా ఉపదేశించిందీ ఉపనిషత్తు. ఇది జీవితంలోనే ప్రయత్నించాలి మానవుడు. నిర్లక్ష్యం చేశాడో ఎంత అనర్ధానికైనా దారి తీస్తుంది. అదే జనన మరణ పరంపర అని కూడా హెచ్చరించింది. ఇదీ బృహదారణ్య సారం.

Page 27

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు