#


Index

ప్రస్థానత్రయ సారము

చూడగలదా ఆత్మ చైతన్యాన్ని. చూస్తే ఆ చైతన్యానికి మరణం లేదు కాబట్టి దాన్ని పట్టుకొన్న ఈ జీవుడికి కూడా లేదు. మరణం. ముక్తుడయి పోతాడు.

  కాని చెప్పినంత సులభం కాదది. దానికొక సాధన క్రమముంది. బాహ్యమైన పదార్థాల నుంచి ఇంద్రియాల దగ్గరికి - ఇంద్రియ వృత్తుల నుంచి మనసు దగ్గరికి మనసు నుంచి అంతకన్నా విశాలమైన మహత్తు దగ్గరికి -దాన్ని కూడా దాటి అవ్యక్తమైన శక్తికీ - ఆశక్తిని కూడా దాటి పూర్ణమైన ఆత్మ చైతన్యానికీ ఎదుగుతూ పోవాలి మానవుడి జ్ఞానం. అప్పుడది ఎక్కడి కక్కడ విశేషరూపంగా పరిమితమై పోక సామాన్యరూపంగా వ్యాపిస్తుంది. అందులో ఈ నామరూపాలన్నీ సముద్ర జలంలో తరంగ బుద్బుదాలలాగా చేరిపోతాయి. అన్నీ చేరిపోయినట్టే జనన మరణాలనే భావాలు కూడా ఒక విశేషమే కాబట్టి అవీ ఆ దృష్టిలో లయమయి పోగలవు. -

  ఇది ఒక రథ మీశరీరం. జీవుడొక రథికుడు. బుద్ధి వీడికి సారథి. ఇంద్రియాలు దీన్నిలాగే గుఱ్ఱాలు. అయితే ఇవి ప్రాపంచిక విషయాలనే మార్గంలో కాక వీటినన్నింటినీ వ్యాపించిన చైతన్య మనే గమ్యాని కభిముఖంగా పయ నించాలి. అప్పుడే జీవిత గమ్యమైన మోక్షాన్ని అందుకోటం సులభమవుతుంది. ఇదీ కఠోపనిషత్తు మనకిచ్చే సలహా.

Page 14

బ్రహ్మశ్రీ యల్లంరాజు శ్రీనివాస రావు